విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏమి చేయడానికైనా కాంగ్రెస్ సిద్ధమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ఆదుకోవాల్సిందిపోయి ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా బీజేపీ, వైసీపీ కలిపి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు నిర్వహించిన బంద్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు ప్రజాస్పందన చూసైనా కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. ఉక్కు ఘనులు కేటాయించి, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమం