దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణంటూ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం లాక్డౌన్ ఆంక్షలన్నింటినీ ఈనెలాఖరుతో ఉపసంహరించేందుకు సమాయత్తమౌతోంది. సెప్టెంబర్ 1 నుంచి సాధారణ జనజీవితానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కోవిడ్–19కు సంబంధించి ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలెట్టింది. . ఈ నెలాఖరుతో అన్ని నిబంధనలు ఉపసంహరించితే విద్యాలయాలు, షాపింగ్మాల్స్, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్లు.. ఇలా మూత పడినవన్ని తిరిగి ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఇకముందు కరోనాను ప్రభుత్వాలు ఒక వ్యాధిగానే పరిగణించాలన్న నిర్ణయానికొచ్చేశాయి. ఇతర వ్యాధుల తరహాలోనే దీన్ని కూడా పరిగణిస్తారు.ఈ వ్యాధి సోకకుండా రక్షించుకునే బాధ్యత ఇక ప్రజలదే అని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. వ్యాధిగ్రస్తులైతే అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకే తొలి ప్రమాదం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు నిబంధనల్ని తమంత తాము రూపొందించుకుని అమలు చేయాలన్నది ప్రభుత్వ విధానం. వ్యాధిగ్రస్తులన్న సందేహమొస్తే ప్రభుత్వ వైద్యశాలకెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. రోగులకు వైద్యం మాత్రం ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది
ప్రారంభం లో కోవిడ్ కు బాగా స్పందించింది. మూడు విడతలుగా లాక్డౌన్ ప్రకటించింది. అనంతరం అంచెలంచెలుగా లాక్డౌన్ల ఉపసంహరణ మొదలెట్టింది. అయితే మార్చి 23న మొదలైన లాక్డౌన్ల ప్రక్రియ సడలింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఐదు మాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వ్యాపారాలు నిర్వీర్యమయ్యాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. బ్యాంకింగ్ నుంచి అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది అభివృద్ధి కుదేలు అయింది.
కోవిడ్ కేసుల నియంత్రణకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిం చాయి. రోగ అనుమానితుల్ని గుర్తించడం నుంచి వారికి పరీక్షలు నిర్వహించడం, రోగ గ్రస్తులతో మాట్లాడిన లేక కలిసిన వారందరినీ వెదికిపట్టుకోవడం, వారందరికీ రోగ నిర్ధారణ పరీక్షలుచేయడం, రోగగ్రస్తుల నివాసాల పరిస రాల్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, వాటి నిర్వహణా బాధ్యతల్ని చేపట్టడం రోగ గ్రస్తులకు మందుల నుంచి వైద్య సదుపాయా లన్నీ ఉచితంగా కల్పిం చారు.మరోవైపు అను మానితుల్ని రెండువారాల పాటు క్వారంటైన్ సెంటర్లకు పంపిం చి రోగాన్ని నియంత్రణకు చర్యలు తీసుకోన్నారు. వైద్యులు. పోలీస్, రెవెన్యూ. పురపాలక సంఘం అధికారులు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
ఐతే లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద, మధ్యతరగతి ప్రజలందరికీ జాతీయ ఆహార భద్రతా పథకాన్ని విస్తరించాయి. ఉచితంగా బియ్యం, పప్పు దినుసులు అందించాయి. ఈ క్రమంలో జనం ఇళ్ళకే పరిమితం కావడంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ఆర్థిక వృద్ధి నిల్చిపోయింది.దేశంలో కరోనా విస్తృతి తగ్గకపోయినప్పటికీ కోవిడ్-19 ప్రభావం మందగించడం, రోగగ్రస్తుల రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం తో కొవిడ్ ఆంక్షలను ఎత్తి వేయాలని చూస్తున్నారు.
సెప్టెంబర్ 1నుంచి సినిమా థియేటర్లు ప్రేక్షకులతో నిండి పొనుంది.షాపింగ్ మాల్స్లో కొనుగోళ్లు ప్రంభం కానున్నాయి. కళ్యాణమండపాల్లో శుభ కార్యాలు జరగనున్నాయి. రైళ్ళు అంచెలంచెలుగా ప్రారంభించనున్నాయి. కరోనా నేపథ్యంలో సినిమాలు టీవీ షూటింగులు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. నిబంధనలు అమలు చేస్తూ షూటింగు లు జరుపు కోవచ్చని తెలిపింది.
గత ఐదు మాసాల్లో దేశంలోని 130 కోట్ల మందిని రక్షించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇందుకోసం నిబంధనలు, నిషేధాజ్ఞలు విధించాయి. కరోనా కట్టడి చేసేందుకు పోలీసు సేవలను వినియోగించాయి. అయినప్పటికీ జనంలో ఎలాంటి మార్పు రాలేదు నిబంధనలు అంతంత మాత్రమే పాటిస్తున్నారు. దీంతో రోజురోజుకు కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు. రోగప్రభావం తగ్గేందుకు ప్రకృతి సిద్ధ కారణాలే తప్ప ప్రజల చైతన్యం ఏమాత్రం కారణం కాదు. ఐదు మాసాలుగా కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వారికి దీని కట్టడిపై నెమ్మదిగా స్పష్టత వస్తోంది.
ఇప్పటికే రోగగ్రస్తులకు అవసరమైన మందులు అంచెలంచెలుగా అందుబాటులోకొస్తున్నాయి. మరోవైపు రోగం రాకుండా కట్టడి చేయగలిగే టీకాలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్నాయి మొత్తం 130కోట్ల భారతీయులకు ఈ టీకాలేస్తామని కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. ఇక కరోనా నుంచి రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తిపైన పడింది.
తమ కుటుంబ సభ్యులు, సహచరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర రోగాల తరహాలోనే ప్రభుత్వాస్పత్రిలో దీనికి వైద్యం లభిస్తుంది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు యదావిధిగా పనులు ప్రారంభిం చుకోవచ్చు వీటిలో పని చేసే కార్మికులకు కరోనా నుంచి రక్షణ చర్యల్ని మాత్రం ఆయా సంస్థల యాజమాన్యాలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వ సృష్టం చేసింది. ముందు మాదిరిగా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనీ తమ జీవన గమనాన్ని చక్కబెట్టుకోవాలి. ఇప్పటికే సాఫ్టువేర్ కంపెనీలు తమ ఉద్యగులను ఇంటి వద్దనే ఉంటూ విధులను నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.