రొటీన్ చిత్రాలకు కాలం చెల్లింది. విభిన్నతరహా కథలను వైవిధ్యంగా చూపగలిగిన చిత్రాలకే ప్రేక్షకులు పట్టంకడుతున్నారు. రానా, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న `విరాటపర్వం’ చిత్రాన్ని కూడా విభిన్న తరహా కంటెంట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. లోగడ ‘నీది నాది ఒకే కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఊడుగుల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి తీస్తున్న ఈ చిత్రం కొద్దిపాటి షూటింగ్ మినహా పూర్తయింది.
మిగిలివున్న ఆ చిన్న షెడ్యూల్ చిత్రీకరణ తిరిగి మొదలైంది. ఇందులో భాగంగా రానాతో పాటు కొందరు నటీనటులు పాల్గొన్న రాత్రి సన్నివేశాలను తీస్తున్నారు. ఇంతకుముందెన్నడూ తాము చేయని పాత్రలను ఈ చిత్రంలో పోషిస్తున్నామని రానా, సాయిపల్లవి తెలిపారు. సాయిచంద్.. ఇంకా ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, బెనర్జీ, నాగినీడు, సాయిచంద్, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి తదితరులు తారాగణం. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, సినిమాటోగ్రఫీని: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, ఎడిటింగ్ ను శ్రీకర్ ప్రసాద్, స్టంట్స్ ను : స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్ అందిస్తున్నారు.











