విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు..
ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విజయవాడ ధర్నా చౌక్ లో దీక్షకు దిగారు. ఈ దీక్షకు ఏపీలోని అన్ని దళిత సంఘాలు మద్దతును ప్రకటించాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్దమని ప్రభుత్వ చర్యలను ఖండించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన నిధులను కలిపి చూపించడం చట్టవిరుద్దమని నినదించారు. జగన్ ను గెలిపించేందుకు తాము ఎంతగానో శ్రమించామని, ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని పలువురు ముఖ్యనేతలు మండిపడ్డారు.
Must Read:-అయ్యన్నకు హైకోర్టులో ఊరట!