ప్రాణాలపై ప్రయోగాలు.. ఫలితం అనుభవిస్తున్నాడు!
నిండు ప్రాణాలపై ప్రయోగాలు, క్రినికల్ ట్రైల్స్ చేయడం చట్టరీత్య నేరం. నెల్లూరు జిల్లాలో ఓ బీఫార్మసీ విద్యార్థులు చేసిన నిర్వాకానికి వైద్యం వికటించి, ట్రాన్సజెండర్ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివారాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ( 28 ) కు వివాహమైంది. పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి ఒయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలిసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని బీఫార్మసీ విద్యార్థులు పరిచయం అయ్యారు. అయితే శ్రీకాంత్ హిజ్రాగా మారాలని నిర్ణయం తీసుకోవడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీఫార్మసీ విద్యార్థులు తామే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చారు.
ఈ నెల 23న ఆపరేషన్ ..
నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని మస్తాన్, జీవా అనే బీ ఫార్మసీ విద్యార్థులు మోనాలీసా సాయంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించడంతో, ఓవర్ బ్లీడ్ మొదలైంది. అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేయలేక విద్యార్థులు చేతులెత్తేశారు. దీంతో శ్రీకాంత్ పల్స్ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్ది సేపటికే శ్రీకాంత్ చనిపోయాడు. దాని తర్వాత నిందుతులు అక్కడి నుంచి పారిపోయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేయడంతో మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు శ్రీకాంత్ అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Must Read:-గురజాలలో పల్నాడు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయ్యాల్సిందే!