స్టేట్మెంట్ రాసి ఇచ్చిన దస్తగిరి..
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ చివరి అంకానికి చేరుకుంది. తుది దశకు చేరుకున్న కేసు విచారణను సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోర్టు అనుమతులతో మరోసారి వివేకా కారు డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది సీబీఐ. అయితే దస్తగిరి స్టేట్మెంట్ లో మరిన్ని కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి. దీంతోపాటు కొత్త పేర్లు కూడా బయటకొచ్చాయి. హత్యకు ముందుగా తనను భరత్ యాదవ్ కలిసినట్లుగా దస్తగిరి పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతారని, తోటలోకి రమ్మంటున్నారని భరత్ యాదవ్ చెప్పడని దస్తగిరి సీబీఐకు తన స్టేట్మెంట్ ను రాసిచ్చారు. ఈ స్టేట్మెంట్ తో రేపోమాపో వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్ట్ లు జరుగునున్నట్లు అందుతున్న సమాచారం!
పది ఎకరాల భూమి, కావాల్సినంత డబ్బు..
గత ఏడాది ఆగస్టు 25న సీబీఐ ఎదుట, ఆగష్టు 31న జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తరువాత మరుసటి నెల సెప్టెంబర్ 30న పలువురు తనను కలిశారని, వారి చెప్పినట్లుగా వింటే మంచి ఆఫర్ ఉందని చెప్పినట్లు దస్తగిరి సీబీఐకు వివరించాడు. ఒకసారి భరత్ యాదవ్ తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డిలు వచ్చారని తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. మరోసారి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డిలు పంపించారంటూ తన వద్దకు వచ్చి.. నువ్వు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలంలో చెప్పిన అంశాలు చెబితే నీకు 10.20 ఎకరాల భూమితో పాటు ఎంత డబ్బుకావాలో చెప్పాలని భరత్, అడ్వకేట్ ఓబుల్ రెడ్డి అడిగారని దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. ఇలా కేసు దర్యాప్తును లోతుగా తవ్వకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలానే వివేక హత్య సూత్రదారుల పూర్తి వివరాలను క్రోడీకరించి, కట్టుదిట్టమైన సాక్ష్యాలను సిద్ధం చేస్తోంది సీబీఐ!
Must Read:-వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్ట్లు! మరోసారి కీలక అంశాలను వెల్లడించిన దస్తగిరి!!