గంగిరెడ్డి నన్న నరుకుతా అని బెదిరించారు!
2019, మార్చి 14 వ తేదీ రాత్రి 11.30 గంటలు.. అది వివేకా హత్యకు పథక రచనను అమలు చేసిన సయమం! ఆ సమయంలోనే వివేకా నమ్మిన బంటు ఎర్ర గంగిరెడ్డి హడవుడిగా వివేకా ఇంట్లోకి వెళ్లాడని, ఆ తరువాతే హత్య జరిగిందని వాచ్మెన్ రంగన్న సీబీఐకు, గత ఏడాది జూలై 23న జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరితో పాటు మరో వ్యక్తి ఇంట్లో ఉన్నారని రంగన్న చెప్పారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. వివేకా రక్తపు మడుగులో ఉన్నారని వివరించారు. అదిచూపి భయంతో వణికిపోయా అని, హత్య అనంతరం గంగిరెడ్డి ఆదరాబాదరాగా వచ్చారని, నేను ఆయనకు ఎదురెళ్లి పారిపోతున్న వారు ఎవరు అని అడుగగా.. నాకు తెలియదు.. ఈ విషయం ఎక్కడైనా చెప్పితే.. నిన్ను కూడా నరుకుతా అని చెప్పి వెళ్లిపోయాడని రంగన్న చెప్పుకొచ్చారు. మొత్తంగా వివేకా హత్య కేసులో ఆ పాత్రదారులు ఆ నలుగురు అయితే.. సూత్రదారులుగా మరికొందరు ఉన్నారని స్పష్టమౌతోంది. అయితే వివేకాను హత్య చేయాల్సిన అవసరం, తలెత్తిన పరిస్థితులు ఏమిటన్నది ఇంకా బహిర్గతం కావాల్సిఉంది!
ఆ గొడ్డలి నాదే.. నేనే అమ్మాను!
వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డాలిని నావద్దె కొన్నారని అనంతపురం కదిరికి చెందిన హర్డ్వేర్ దుకాణం యజమాని కరమల కృష్ణామాచారి సీబీఐకు స్టేట్మెంట్ ఇచ్చారు. 2019, మార్చి 14న షేక్ దస్తగిరి రూ. 450 కు తన వద్దనే ఆ గొడ్డలి కొనుగోలు చేశాడని ఆయన వెల్లడించారు. ఇదే విషాయాన్ని కృష్ణమాచారి 2021, సెప్టెంబరు 3న ప్రొద్దుటూరు కోర్టు జడ్జి ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అయితే 2021, ఆగష్టులో సీబీఐ అధికారులు కృష్ణమాచారిని విచారణ నేపధ్యంలో పిలిపించగా.. అక్కడ తనవద్ద గొడ్డలి కొనుగోలు చేసిన దస్తగిరిని గుర్తు పట్టి, ఇతనే నావద్ద ఆ గొడ్డలిని కొనుగోలు చేశాయాడని సీబీఐ అధికారులకు చెప్పారు. అయితే దస్తగిరి అన్న హాజీవలి కూడా తన వద్దే వ్యవసాయ పనిముట్టు. హార్డ్వేర్ సామాగ్రి కొనుగోలు చేసేవాడని కృష్ణమాచారి తెలిపారు. ఇలా వివేకాను హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలిని కదిరి నుంచి తీసుకొచ్చినట్లు సీబీఐ తన విచారణలో ఒక నిర్థారణకు వచ్చింది!
Must Read:-వివేకాను చంపింది ఆ నలుగురే..! నేనే కళ్లారా చూశా! ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం!!