అమరాతిని కాపాడుకుంటాం.. రైతు పాదయాత్రకు సంపూర్ణ మద్దతు!
రాజధాని అమరావతికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని పురంధేశ్వరి విజయవాడ బీజేపీ స్టేట్ కార్యాలయంలో వెల్లడించారు. పాదయాత్రలో రైతులపై జరుగున్న దాడులను పూర్తి ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులను అందరూ ముక్తకఠంతో ఖండిచాలని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ. 1500 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని అధికారపార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడ మడతిప్పలేదు .. మాట తప్పలేదని చెప్పారు. కేంద్ర నిధులతోనే నేడు ఏపీలో అభివృద్ధి జరుగుతోందని పునరుద్ఘాటించారు.