విజన్ 2024@ అధికారం వైపు అడుగులు!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నవంబర్ 19, శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా జరిగిన కౌరవ సభలో దుశ్శాసనుడి పాత్రను పలువురు పోషించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిని వ్యక్తిగత జీవితాన్ని నడిరోడ్డుపైకి ఈడ్చారు. అమమాన భారంతో చంద్రబాబు తీవ్ర వేదనకు గురైయ్యాడు. నాటి నుంచి రాష్ట్రంలో రాజీకీయ ముఖచిత్రం మారింది. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికారపార్టీ దాష్టికాన్ని ఎండగట్టాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ముఖ్యులు, ప్రజాప్రతినిధులు, సినీ వర్గాల ప్రముఖులు స్పందించారు. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండించారు. రాజకీయాల్లో హుందాతనం లోపించిందని, వ్యక్తి దూషణలు మానుకోవాలని అధికారపార్టీ అకృత్యాన్ని ఎత్తిచూపారు. అవమానం తట్టుకోలేక సీఎం అయిన తరువాతే మళ్లీ అసెంబ్లీ అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు బయటకొచ్చాడు. రెండు రోజులు విరామం తరువాత రేపు చిత్తూరు పర్యటించి, అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటికానున్నారు. 2024 వరకు ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలను చేపట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా ప్రజల్లో ఉండేలా .. ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వారితో మమేకమై ప్రభుత్వాన్ని నిలదీసేలా పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రణాళికబద్థంగా ముందుకు సాగేలా పూర్తి స్థాయిలో శ్రేణులు సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలపైనే దృష్టి కేంద్రీకృతం ..
జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజాహిత ఉద్యమాలు, అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. పార్టీ శ్రేణులును సన్నద్ధం చేసి, కేడర్ ప్రతిష్టం చేసేందకు అడుగులు వేయనున్నది. కిందిస్థాయి కార్యకర్తలకు నూతన ఉత్తేజం, భరోసా కల్పించే దిశగా సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజలు తరుఫున యుద్దానికి సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు, భువనేశ్వరికి జరగిన అవమానాన్ని చూపి పార్టీ కింది స్థాయి నుంచి కేడర్ చలించిపోతుంది. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బయటకొచ్చి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో తమ్ముళ్లు రగిపోయారు. ప్రస్తుతం కార్యకర్తల్లో రగిలిన వేడిని ఇలానే కంటిన్యూ చేసి .. అమరావతి పరిరక్షణ, ప్రభుత్వ వైఫల్యాలు, రెండేళ్లుగా కునారిల్లుతున్న అనేక సమస్యలపై, ప్రజా ఇబ్బందులపై పోరాటాలకు శ్రేణులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలని భావిస్తోంది తెలుగుదేశం.