మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు.గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడ ఢిల్లీ వెళ్లారు.వీరిద్దరిని బీజేపీ సీనియర్ నాయకుడు,పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్ ఢిల్లీ తీసుకెళ్లారు.ఈ రోజు రాత్రికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి,తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వారిని కలసిన తర్వాత ఈటల ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!
వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...











