నిబంధనకు విరుద్ధంగా నిధులు తరలింపు ..!
ఎన్టీఆర్ హెల్త్ వర్పిటీ ఖాతాలో మొత్తం రూ.400 కోట్లు ఎప్పటి నుంచో మూల నిధిగా వస్తోంది. వీటిపై వచ్చే వడ్డీ, విద్యార్థుల ఫీజులు కలిపి వర్సిటీలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు వంటి జరిగిపోతుంటాయి. అటువంటి నిధులపై కన్నెసిన జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ప్రభుత్వం ఖజానాకు తరలించాల్సిందిగా వీసీని ఆదేశించారు. ఈనెల 9న ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు వర్సిటీకి చెందిన నిధులను బదిలీ చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. నాటి నుంచి వర్సిటీ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. గత 36 ఏళ్లగా ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయంలో వర్సిటీ పలు నిబంధనల్ని పాటిస్తోంది. జాతీయ బ్యాంకుల్లో ఏ బ్యాంకు అయితే అధిక వడ్డీ ఇస్తాయో ఆ బ్యాంకులో డిపాజిట్ చేయడం ఆనవాయితి. అది టెండర్ లో పాల్గొన్న బ్యాంకుల్లోనే నిధులను డిపాజిట్ చేస్తుంటారు. కానీ రూ.400 కోట్లను ప్రభుత్వ ఖజానాకు తరలించే ప్రక్రియలో మాత్రం అడుగడుగునా నిబంధనలను తుంగనతొక్కింది. వర్సిటీ యాక్ట్ ను బ్రేక్ చేసి మరి నిధులను తరలించాల్సిన అవసరం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నఫలంగా నిధులు మరలించడంతో రూ.43 కోట్లు నష్టం!
కెనరా బ్యాంకు లో ఫిక్సడ్ డిపాజిట్ లో ఉన్న వర్సిటీ నిధులు ఉన్నఫలంగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్ఎస్సీ) మళ్లించడం వల్ల హెల్త్ వర్సిటీ దాదాపు రూ. 43 కోట్ల వరకు వడ్డీ నష్టపోవాల్సి వస్తోందని బ్యాంకు వర్గాలు చెప్పినప్పటికీ వినకుండా నిధులు ట్రాన్సఫర్ కు వీసీమొగ్గుచూపారు. ఈ నెల 25వ తేదీన ఎస్ఎఫ్ఎస్సీ లేఖలో 5.5 శాతం వడ్డీ ఇస్తామని చెప్పగా నిధులకు మరలింపుకు అవసరమైన తతంగాన్ని పూర్తి చేశారు వీసీ డా.పి. శ్యామ్ ప్రసాద్. వర్సిటీ మనుగడ, సంక్షేమం, ఉద్యోగుల భవిష్యత్తుతో నాకే పనిలేదన్నట్లు వీసీ వ్యవహరిస్తున్నాడని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు చెప్పాడు .. నేను భక్తుడను .. చెప్పింది వింటమే నా పని అన్నట్లు నిబంధనలకు తూట్లు పొడుస్తూ నిధులను ఎస్ఎఫ్ఎస్సీకి తరలించారని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు
దేవుడు చెప్పాడు .. భక్తుడు పాటించాడు అన్నచందంగా వీసీ శ్యామ్ వ్యవహరిస్తున్నారని వర్సిటీ ఉద్యోగులు ఆందోళన వక్తం చేస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకునేందుకు కార్యచరణ ప్రారంభించారు. వర్సిటీ వేదికగా రాజుకుంటున్న రాజకీయం నిధుల మళ్లింపుతో భగ్గుమంటుంది. వీసీ, రిజిస్ట్రార్ మినహా మిగిలిన వారంతా ఉద్యోగుల పక్షాన నిలుస్తున్నారు. నిధులు మళ్లించడానికి నిరసిస్తూ విధులను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని రెండు యూనియన్లు ఒకే మాటపై నిలబడ్డాయి. వీసీ చాంబర్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యోగులు. వర్సిటీ నిర్వహణకు ప్రతి ఏటా రూ. 70 నుంచి రూ.80 కోట్లు ఖర్చు అవుతోంది. ఉద్యోగుల జీతాలకు అయ్యే ఖర్చుకు రూ.18 కోట్లు కూడా ఈ నిధులు ద్వారానే వెచ్చించాల్సి ఉంది. ఇలా అన్నింటికి కీలంగా మారిన వర్సిటీ నిధులు ఎలా తీసుకుంటారని ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- సొంత నిర్ణయాలు మానుకొండి .. కోర్ కమిటీ ఆదేశాలను పాటించండి!