ఐదేళ్లపాటు కొనసాగుతారు!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సవాంగ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా కొనసాగుతున్న ఉదయ్ భాస్కర్ పదవీకాలం 6 నెలల క్రితమే పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఇటీవలే డీజీపీ పోస్టు నుంచి సవాంగ్ ను ఏపీ ప్రభుత్వం తప్పించింది. దీంతో సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త బాధ్యతుల స్వీకరించిన సవాంగ్ కు తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొససాగుతారు.