సూర్యాపేటలో 47వ జూనియర్ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Must Read ;- ఐపీఎల్ ఆతిథ్యానికి అవకాశమివ్వండి.. కేటీఆర్











