తనపై 2019 ఎన్నికల ముందు, తర్వాత దాదాపు 100 సార్లకు పైగా పార్టీ మారుతున్నట్లు ప్రచారాలు వచ్చాయని విశాఖ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఓసారి వైసీపీ అని, మరో సారి బీజేపీలో అని రకరకాల ప్రచారం జరిగిందని అన్నారు. ఈ రకాల వార్తలు వచ్చినప్పుడల్లా తాను ఖండిస్తూనే ఉన్నానని అన్నారు. తనకు వైసీపీలో చేరే ఉద్దేశం లేదని, ఈ రోజు విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో తనకు తెలియదన్నారు. తాను ఎటువంటి ప్రతిపాదనలు పంపానన్న దానికి ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
Must Read ;- రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఏపీఎస్ఆర్టీసీ.. ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడేమంటారో!
ఇలా రక రకాల వార్తలు నా మీద వస్తూనే ఉన్నాయి నేను ఇప్పటికే చాలా సార్లు కండిస్తూనే వస్తున్నాను, సడన్ గా ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదు, నేను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డి గారే సమాధానం చెప్పాలి
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 3, 2021











