హైదరాబాద్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. విమానాల్లో గుర్తు తెలియని విధంగా బంగారం తరలించే మాఫియా ఈసారి రూటు మార్చింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో రోడ్డు మార్గాలను ఎంచుకుంటున్నారు. అధికారులు నిఘా వేసి పట్టుకుంటున్నారు. తాజాగా ఇవాళ సిటీలోని పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా బంగారం పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. మొత్తం 25 కిలోల బంగారం తరలిస్తున్నట్లు సమాచారం. బంగారం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, కోలకత్తా నుంచి చెన్నైకు తరలిస్తున్నట్లు తేలింది. కలకత్తాలో ఎన్నికలు ఉన్నందున సొమ్ము చేసుకునేందుకే భారీగా బంగారం తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- అది బంగారం బాసూ.. రేటు తగ్గినా బెంబేలే!