ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ .. ఈ సాయంత్రం తన తాజా సినిమాకి సంబంధించిన అప్టేట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ‘శాకుంతలం’ టైటిల్ తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల దృశ్యంతుల ప్రణయ కథను గుణ శేఖర్ తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు.
నిజానికి గుణ శేఖర్ విష్ణు మూర్తి నరసింహావతారానికి బేస్ అయిన హిరణ్యకశ్యప సంహారం ఇతివృత్తంతో భారీ స్థాయిలో ‘హిరణ్యకశ్యప’ టైటిల్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశారు .ఈ లాక్ డౌన్ టైమ్ ను ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే కేటాయించారు. అయితే ఆ సినిమాకి ఇంకా టైమ్ పట్టేలా ఉండడంతో .. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నీలిమా గుణ నిర్మాణ సారధ్యంలో .. మణిశర్మ సంగీత సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. దీనికి సంబంథించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు గుణశేఖర్ . కేస్టింగ్ ను ఇంకా ప్రకటించలేదు.
Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’..
Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze— Gunasekhar (@Gunasekhar1) October 9, 2020