నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, వైద్య పరీక్షలు,బెయిల్ పిటిషన్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.అయితే రఘురామకృష్ణరాజు అరెస్టు,వైద్య పరీక్షల వ్యవహారానికి సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో వాదనల సమయంలో ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పి.సుధాకర్ రెడ్డి వినియోగించిన పదాలు,వ్యవహార శైలిపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు ప్రముఖ లీగల్ వెబ్ సైట్ బార్ బెంచ్లో కథనం ప్రచురితమైంది.ఆ కథనం ప్రకారం RRR కేసులో ఏఏజీ సుధాకర్రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని,ఈ మేరకు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సెల్కు సిఫారసు చేయవచ్చని,అయితే ఉదారతతో ఆ చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.ఇదే అంశంపై మరో న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నేవ్యక్తం చేశారు.ఏఏజీ ఇలాంటి వైఖరినే మరోసారి ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా కోర్టు నిర్దేశించిన సమయంలో వైద్య నివేదిక పంపడంలో విఫలమైనందున,కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంపై సీఐడీ అదనపు డీజీ సునీల్కుమార్,మంగళగిరి సీఐడీ ఎస్హెచ్వో,మెడికల్ బోర్డు ఛైర్మన్,గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్ జ్యుడీషియల్ను ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ కేసును వేసవి సెలవుల తరవాత విచారిస్తామని పేర్కొంది.
జరిగింది ఇదీ..
కాగా మే14న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే .మే 15న రఘురామకృష్ణరాజును గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి/మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చిన సందర్భంగా తన కాళ్లకు గాయాలయ్యాయని రఘురామకృష్ణరాజు సంచలన విషయాన్ని వెల్లడించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామకృష్ణరాజుకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరపాలని,16వ తేదీ 12గంటల్లోగా నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డును ఆదేశించింది.అదే రోజు ఎంపీ కాలికి అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లేఖ రాశారు.దీంతో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణం (ఫోర్త్ విత్) అమలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.అయితే రఘురామకృష్ణరాజుకు గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు, ఆ నివేదిక 16న సాయంత్రం 6:30 గంటలకు హైకోర్టుకు చేరింది.దానిపై మే 19న హైకోర్టు విచారణ జరిపింది.విచారణలో భాగంగా గుంటూరు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని,తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశారా లేదా అని ప్రభుత్వం తరఫు న్యాయవాది,ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.ఇందుకు సమాధానంగా ఆదేశాల కాపీ ఆలస్యంగా అందిందని చెప్పడంతో పాటు రాత్రి జైలు తలుపు తెరిచి ఎంపీ రఘురామకృష్ణరాజుని తరలించాలా అని వ్యాఖ్యానించడంపై అభ్యంతరం తెలిపింది.ఆ రోజు ఆలస్యంగా ఉత్తర్వులు అందితే మరుసటి రోజైనా అమలు చేశారా అని ప్రశ్నించామని,సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజును సైనికాసుపత్రికి తరలించాల్సిందిగా ఆదేశించిందని చెప్పారని,అయితే తమ ఆదేశాల అమలు చేయాకపోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపడం సరికాదని పేర్కొంది.17వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది.
వాదనల్లో ఏఏజీ వాడిన పదాలపై అభ్యంతరం..
ఈ సందర్భంగా ఏఏజీ వాదనల్లో భాగంగా వాడిన పదాలపై అభ్యంతరం తెలిపింది.ఏఏజీ తన గొంతు పెద్దది చేస్తూ కోర్టును భయపెట్టేలా వ్యవహారించారని,ఆర్టికల్ 226 కింద కోర్టు జారీ చేసిన ఫ్రాడ్/ ఇల్లీగల్’ ఉత్తర్వులను అమలు చేయడానికి వీల్లేదని వాదించారన్నారు.మెజిస్ట్రేట్ జారీ చేసిన ఫ్రాడ్/ఇల్లీగల్ ఆర్డర్ అమలుకు హైకోర్టు వేదికగా మారిందని వ్యాఖ్యానించారన్నారు.ఏఏజీ ఆరోపిస్తున్నట్లు ఆ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు కాని బెదిరించే విధంగా గొంతు పెద్దది చేయడంతోపాటు తన వాదనలకు అనుమతి రాకుంటే వాకౌట్ చేస్తామనే ధోరణితో మాట్లాడారన్నారు.ఈ కేసులో న్యాయస్థానానికి ప్రత్యేక ఆసక్తి ఏంటని ప్రశ్నించారని,కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించేలా మాట్లాడారన్నారు.కాగా కస్టడీలో ఉన్నది ఎంపీనా,సాధారణ పౌరుడా అని ప్రత్యేకించి చూడలేమని,అందరూ సమానులేనని,కస్టడీలో ఉన్నవారిని పోలీసులు కొట్టారని,నడవలేని స్థితిలో ఉన్నారని,సంబంధిత ఫొటోలు న్యాయస్థానం ముందుకి వచ్చినప్పుడు హైకోర్టు తలుపులు మూసుకుని ఉండబోదని వ్యాఖ్యానించారు.నిందితులకు ఉండే హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది.
హక్కులు కాపాడే విషయంలో..
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడే విషయంలో న్యాయస్థానాలు కచ్చితంగా తక్షణమే స్పందిస్తాయని,విచారణ జరుపుతాయని అప్పుడే ప్రజలకు విశ్వాసం ఉంటుందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగాఎక్కువ బాధ్యత కలిన వ్యక్తి అని,పెద్దరికంగా ఉండాలని,తన సహచరుల్లో, న్యాయస్థానాల్లో ఉన్న మంచిపేరు,గౌరవం అయనకు ఏనలేని పరపతి అని వ్యాఖ్యానించింది.మరోసారి కోర్టు పట్ల అమర్యాదపూర్వకంగా,పరుషంగా,అగౌరవంగా,అభ్యంతరకర భాష,ఆవేశంతో కూడిన వాదన చేస్తారని కోర్టు భావించడం లేదని వ్యాఖ్యానించింది.కాగా జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ వాదనల సందర్భంగా ఏఏజీ కొంత నియంత్రణ ప్రదర్శించి ఉండాల్సిందని భావిస్తున్నానని,వాదోపవాదాల్లో నియంత్రణ పాటించడం హాల్ మార్క్ అని,ఏ పరిస్థితుల్లోనూ ఆవేశాలను లోనుకాకూడదని,పద ప్రయోగం కూడా ప్రతిష్టలు పెంచేలా ఉండాలని వ్యాఖ్యానించారు.
Also Read ;- రఘురామరాజుకు బెయిల్ ఇప్పించింది జగన్ లాయరే..!











