Home Food Is Best Food After Corona :
కరోనా కారణంగా జనాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కు బదులుగా సమతుల ఆహారం తీసుకుంటూ వైరస్ ల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంటి ఫుడ్ తింటూ..
ఉద్యోగులు, విద్యార్థులు, వర్కర్స్.. ఇలా చాలామంది స్వయంగా వండుకోలేని పరిస్థితి. కరోనా వైరస్ రాకముందు వరకూ ఏదో తిన్నాం…అన్నట్టుగా ఆహార పద్ధతులను పాటించేవాళ్లు. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చాలామంది ఇంటిఫుడ్ కే ఓటేస్తున్నారు. ఇంట్లో వండుకునే ఆహారంలో పోషకల విలువలు ఉండటం.. ఆయిల్, మసాలా లాంటివి చాలా తక్కువ ఉండటమే అందుకు కారణం. అంతేకాదు.. వ్యాధి నిరోధశక శక్తి పెంచే ఐటమ్స్ తింటూ హెల్తీగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బలమైన ఫుడ్ తీసుకోవడం వల్ల వైరస్ లు దాడి చేసినా, త్వరగా కోలుకోనే అవకాశం ఉంటుందని అని చెప్తున్నారు. కరోనాతో పాటు ఇతర వైరస్ ల ముప్పు ఉన్నందున ఆహార నియమాలు కచ్చితంగా మార్చుకోవాల్సిందేనని చాలామంది చెప్తున్న మాట.
పోషకాలు, విటమిన్లకు ప్రాధాన్యం
మన ఇమ్యూనిటీ బాగుంటేనే.. మన ఆరోగ్యమూ బాగుంటుంది. ఏ వ్యాధి ప్రభావం చూపినా త్వరగా కోలుకోవచ్చు. కరోనా పోరులో ఇమ్యూనిటీదే పైచెయ్యి. అందుకే చాలామంది జంక్, ఆయిల్ ఫుడ్ కాకుండా.. రోగ నిరోధశక్తినిచ్చే ఫుడ్ ను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకుంటన్నారు. ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, తగిన మాంసం, చేపలు లాంటివి తింటూ కరోనాను జయిస్తున్నారు. వీటితో పాటు డ్రై ప్రూట్స్ (బాదం, పిస్తా) కూడా క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు.
Home Food :
ఒత్తిళ్లకు దూరంగా
రోగ నిరోధక శక్తి పెంచడంలో పండ్లు, పండ్ల రసాలు ముందుంటాయి. అందుకే చాలా మంది ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తినిచ్చే విటమిన్స్ పండ్లను తింటున్నారు. శారీరక బలం పేరుతో కొంతమంది అదేపనిగా తినేవారు.. కానీ కరోనా తర్వాత చాలామంది మితంగా భోజనాలు చేస్తున్నారని పలు హెల్త్ సర్వేలు సైతం చెప్తున్నాయి. మాంసాహారం, డ్రైప్రూట్స్ అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వేధించే ప్రమాదం ఉండటంతో జీవనశైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తగినంత నిద్రపోతూ ప్రశాంతమైన జీవనం గడపడానికి ఆసక్తి చూపుతున్నారు.