కరోనా కేసులు పెరుగుతుండటంతో, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా బారిన పడి ఎవరైనా చనిపోతే, ఎక్కడ అంత్యక్రియలు జరపాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోతే మాత్రమే జీహెచ్ఎంసీ అధికారులే అంత్యక్రియలు నిర్వహించేవాళ్లు. అయితే చాలామంది హోం ఐసోలేషన్ లో ఉంటూ చనిపోతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల వద్ద చనిపోయినవాళ్ల అంత్యక్రియల నిర్వహణ బాధ్యత కూడా జీహెచ్ఎంసీ తీసుకోనుంది. ఇందుకు అయ్యే ఖర్చు కూడా జీహెచ్ఎంసీ భరిస్తుంది. అయితే కొవిడ్ ను అడ్డం పెట్టుకొని కొంతమంది అంత్యక్రియల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో చాలామందికి ఖర్చుల బాధలు తప్పనున్నాయి.
Must Read ;- కరోనా కల్లోలం.. ఎక్కడికక్కడ స్వీయ లాక్ డౌన్