బడుగు బలహీన, అనగారిన వర్గాల ఓట్ల కోసం జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారు. దళితుల పట్ల వల్లమాలిన ప్రేమను కనబరుస్తూ.. ఆయన చేసే జిమ్మిక్కులు మేధావులు గమనిస్తూనే ఉన్నారు.
జగన్ రెడ్డి ఈ నాలుగునరేళ్ళ పాలనలో దళితులపై జరిపిన అన్ కౌంటబుల్ దాడులు దేశ వ్యాప్తంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కారంచేడు.., చుండూరు ఊచకోతలను మరిచి.., ఇప్పుడిప్పుడే దళిత సమాజం సమనత్వపు అడుగుల్లో అడుగులు వేస్తున్న క్రమంలో జగన్ సాగిస్తున్న దమనకాండ భయబ్రాంతులకు గురిచేస్తోంది. నిత్యం దళితులపై టార్గెట్ చేస్తూ.. సాగిస్తున్న దమనకాండ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. గత పాలకుల దళితుల పట్ల నడుచుకున్న పాలన విధానాలకు తిలోదకాలు వదిలి.. రాచరిక పాలనను సరికొత్తగా పరిచయం చేశారు జగన్.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, కార్సోరేషన్ ద్వారా అందే సంక్షేమాన్ని పక్కదారి పట్టించి.. సామాజీకంగా, ఆర్ధికంగా దళితులను 50 ఏళ్ళ వెనక్కి లాగేశారన్న క్రెడిట్ జగన్ రెడ్డికే దక్కుతోంది. సెంటు స్థలం పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఎందరో దళితుల భూముల్లేక రోడ్డున పడ్డారు. ఊరి చివరనే మా గూడు అన్న అనాగరిక నినాదానికి జగన్ విధానాలు తోడై ఇచ్చే ఆ సెంటు భూమిని కూడా శ్మశానాల్లో ఇచ్చి.. సనాతన వివక్ష, అస్పృస్యతలను బయటకు తీశారు. చివరికి దళితులు అధికంగా ఉన్న అమరావతిని మూడు ముక్కలు చేసి.. ఆడిన నాటకంలో దళిత కుటుంబాలే ఎక్కవ నష్టపోయాయి.
ఇవన్నీ ఇలా ఉంటే .. దేశం నివ్వెరబోయే స్ధాయిలో ఏపీలో దళితులపై జరిపిన దమనకాండకు సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. లిక్కర్ మాఫియాను ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ ను పొట్టనపెట్టుకున్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కు శిరముండనం, పల్నాడులో దళిత యువకుడు విక్రమ్ హత్య, అదే పల్నాడులో ట్రాక్టర్ తో తొక్కి గిరిజన మహిళను చంపిన ఘాతుకాలు ఎన్నో. ఇలా హత్యలే కాదు.., అత్యాచారాలు, భూములు లాక్కొవడం .., ప్రశ్నిస్తే చిత్రవధకు గురిచేసి.., చంపడం వంటివి ఈ నాలుగునరేళ్ళల్లో ఎన్నో చూశాం.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దమకాండను గుర్తు చేసుకుంటూ.. జగన్ పాలన చూసి భయపడిపోతున్నారు. దళితులపైనే దాడి చేసి.., వారిపైనే కేసులు నమోదు చేసిన వైనం వారి మనుగడను ప్రశ్నిస్తోంది. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యపరిచి.. దళితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయంలో 2015 నుంచి 2019 వరకు అట్రాసిటీ కేసులు స్టేషన్ కు వచ్చినవి వచ్చినట్లే నమోదు చేసి.., వారికి న్యాయం జరిగేలా చూశారు. రాజకీయాలకు అతీతంగా దళితులకు అండగా నిలబడింది చంద్రబాబే అని నేటికీ దళితుల్లో ఆ సానుభూతి ఉంది.
ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో దళితుల ఉన్నతికి ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ ఆడపిల్లల వివాహానికి ఆర్ధిక సాయం, పారిశ్రామీకవేత్తలుగా ప్రోత్సహించడం వంటి 28 దళిత సాధికారిక పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతోంది. చంద్రబాబు ప్రభుత్వం 2018-2019 లో దాదాపు 8 వేల 800 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వం కేవలం 4 వేల కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకోవడం దళితులను ఇంకా పేదరికంలో నెట్టడమేకాక ఏమిటని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంత తుగ్లక్ చర్య కాకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యను నీరుగార్చడమేకాకుండా అంబేద్కర్ పేరు తీసేసి.. జగన్ పేరు పెట్టుకోవడం దళితుల పట్ల వివక్ష ఏ పాటిదో అర్ధమవుతోంది. మూడు వందల మంది దళితులను పొట్టనబెట్టుకోవడమేకాక.., దాదాపు 6 వేలకు పైగా వారిపై దాడులు జరిగాయి. చివరికి జగన్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బలైన దళిత యువకుడు కోడికత్తి శ్రీను పరిస్ధితి ఏంటో ఈ ఐదేళ్లల్లొ అందరూ చూసిందే.
ఈ దుశ్చర్యలన్నీంటిని చెరిపేసి.., దళితుల ఓట్లు దండుకునేందుకు జగన్ ప్రభుత్వం .., విజయవాడలో ఎతైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిచడం రాక్షసుడు రాముడి వేషం వేసినట్లుందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి