కేసీఆర్ ధీమా చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యమేస్తోంది. ఆ తీసుకునే నిర్ణయాలు వింటే.. అందరికీ మైండ్ బ్లాక్ అయ్యి తీరాల్సిందే.
తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. పోలైన ఓట్ల శాతం.. రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఇట్టే చెప్పేస్తున్నాయి. దేశం వ్యాప్తంగా ఉన్న జాతీయ మీడియా, స్వచ్ఛంధ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కాంగ్రెస్ కే అనుకూలంగా ఇచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారలోకి రాబోతోందని జోష్యం చెప్పగా.. ఆ పోల్స్ నివేదికలను బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. ఏదీఏమైనా పైకే గానీ..,బీఆర్ఎస్ అధిష్టానానికి సైతం ఎగ్జిట్ పోల్స్ లెక్కలు మింగుడుపడని అంశమనే చెప్పాలి. ఈ నేపధ్యంలో నేడు కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రగతి భవన్ సాక్షిగా కేసీఆర్ గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ… నెక్ట్స్ మనమే అధికారంలోకి రాబోతున్నాం.. ఆ ధైర్యపడకుండా ఈ రెండు రోజులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అలానే డిసెంబర్ 3 ఆదివారం కౌంటింగ్ ముగియగానే.., డిసెంబర్ 4 సోమవారం సచివాలయంలో కెబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అంటే.. ఫలితాలన్నీ బీఆర్ఎస్ అనుకూలమని.., గెలిచే తీరేది బీఆర్ఎస్సేనని నేతలతో కేసీఆర్ నేరుగా చెప్పేసినట్లు తెలుస్తోంది. గెలుపు అవసరమైన మెజారిటీ సీట్లును బీఆర్ఎస్ కౌవసం చేసుకుంటుందని.., అధికారంలో వచ్చిన తొలిరోజే.. మంత్రులందరూ సచివాలయానికి వచ్చి.. తాను నిర్వహించే సమావేశంలో పాల్గొనాలని సూచించారు కేసీఆర్. ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాజకీయం వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
కేసీఆర్ లెక్కకు ఒక అంచన ఉంటుంది. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడటం.., కాకిలెక్కలు వేసి.., చెప్పడం ఎప్పుడూ చేయడు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలానే మరోవైపు 2018 లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చినప్పుడు కూడా మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నిర్భరంగా వాటిని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో కీసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కేటీఆర్ జోష్యం చెప్పారు. ఏదీఏమైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీల భవిష్యత్తు తేలాలంటే.. డిసెంబర్ 3 వరకు వేచి చూడక తప్పదు.