నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఇండియన్ బ్యాట్స్ మన్ క్రునాల్ పాండ్యా అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. పెవిలియన్ లో ఉన్న తమ్ముడు హార్దిక్ మ్యాచ్ ను చూస్తూ కంట తడి పెట్టాడు. మ్యాచ్ అనంతరం అన్న క్రునాల్ ను గట్టిగా కౌగిలించుకొని అభినందించాడు. ఇటీవల చనిపోయిన తన తండ్రికి అర్ధ సెంచరీని అంకితం చేస్తూ కంట తడి పెట్టాడు. దాంతో ఫ్యాన్స్ కూడా ఎమోషన్ అయ్యారు. క్రునాల్ కంటతడి పెట్టే వీడియాలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Must Read ;- ప్రసిద్ధ్,కృనాల్ అదుర్స్.. తొలి వన్డేలో భారత్ విజయం
This is all heart 💙🫂
A teary moment for ODI debutant @krunalpandya24 post his brilliant quick-fire half-century💥💥@hardikpandya7 #TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/w3x8pj18CD
— BCCI (@BCCI) March 23, 2021