దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా సెకండ్ వేవ్ ను ముందగానే పసిగట్టిన కేజ్రీవాల్ లాక్ డౌన్ చర్యలు చేపట్టి సక్సెస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తున్నందున, మరోవారం రోజుల పాటు పెంచుతున్నట్ల నిర్ణయం తీసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదైనట్లు, పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే ఉందని తెలిపారు. కరోనా పోరు ఇంతటితో ఆగిపోదని, మూడో వేవ్ ను కూడా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీకా అందరికీ అందించి, దశలవారీగా ఆంక్షలు ఎత్తివేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Must Read ;- ఢిల్లీలో కేసులు తగ్గాయి : మరణాల సంఖ్య కూడా తక్కువే