మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా 2021 సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. నిన్ననే హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యింది. అయితే.. ఆచార్య తర్వాత ముందుగా సెట్స్ పైకి వెళ్లేది వేదాళం రీమేకా.? లూసీఫర్ రీమేకా.? అనేది ఇప్పటి వరకు అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. వేదాళం రీమేక్ నే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని వార్తలు వచ్చాయి.
మెహర్ రమేష్ స్ర్కిప్ట్ రెడీ చేసి.. చిరు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. చిరు డేట్స్ ఎప్పుడు ఇస్తే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో జనవరిలో లేదా ఫిబ్రవరిలో వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేయనున్నారు అనుకున్నారు. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారిందట. ముందుగా లూసీఫర్ రీమేక్ ప్రారంభించాలి అనుకుంటున్నారని తెలిసింది. ఈ రీమేక్ కి మెహన్ రాజా దర్శకుడిగా ఖాయం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే ట్విట్టర్ లో తెలియచేశారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లాన్ మారడానికి కారణం ఏంటంటే.. రామ్ చరణ్ అని తెలిసింది. చరణే ముందుగా లూసీఫర్ రీమేక్ చేయమని పట్టుబట్టినట్టు తెలిసింది. దీనికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడుగా చేస్తున్నారట. ఈ సినిమాని మార్చి నెలాఖరుకు కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్. ఇది కంప్లీట్ అయిన తర్వాతే వేదాళం రీమేక్ స్టార్ట్ చేస్తారని సమాచారం.
With the blessings of my parents and well wishers, life has always gifted me better and bigger things.
And this time I’m more elated n honored to direct a mega project with the Megastar @KChiruTweets himself 🙏😇
Need all your wishes n prayers 🙏 #MegaStar153 pic.twitter.com/eJ05j2ia7v— Mohan Raja (@jayam_mohanraja) December 16, 2020











