కరోనా ఆపదకాలంలో తమ ఉద్యోగులు కీలకంగా పనిచేశారని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ విస్తరించడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, వాళ్ల సంక్షేమానికి పాటుపడుతామని ఆయన అన్నారు. గురవారం 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) జరిగింది. ముఖ్య అతిథిగా ముఖేష్ అంబానీ హాజరై మాట్లాడారు. కొవిడ్ టైంలో మరణించిన కుటుంబాలకు ఆయన నివాళి అర్పించారు. కరోనా సంక్షంభోనూ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. గత AGM తో పోలిస్తే తమ వ్యాపారం ఊహించిన దాని కంటే పెరిగిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో రిలయన్స్ అచీవ్ మెంట్ సాధించిందన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల తాము బాధ్యతగా ఉంటామన్నారు. దేశంలో ఆక్సిజన్ అందించడంలో రిలయన్స్ 11వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
21వేల మందికి ఉచిత శిక్షణ
కోవిడ్ విరుచుకుపడుతున్న టైంలోనూ రిలయన్స్ గ్రూప్ 45 మిలియన్ల మంది భారతీయులకు సహాయం చేసిందని నీతా అంబానీ పేర్కొన్నారు. మేమంతా కోవిడ్ తో పోరాడామని, కొవిడ్ బారి నుంచి ఉద్యోగులను, ప్రజలను కాపాడుకోవడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. కరోనా కాలంలో రిలయన్స్ 100 ఆక్సిజన్ ట్యాంకర్లను ఉత్పత్తి చేసిందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడామని అన్నారు. ఈ ఏడాది జియో ఇనిస్టిట్యూట్ను ప్రారంభించి, 21వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తామని ఆమె తెలిపారు.
Must Read ;- మళ్లీ ముఖేశ్ అంబానీయే ఆసియా నెం.1











