మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఆమె ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ, టీడీపీ పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేస్తే, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ రాష్ట్రంలో అధికారం సాధించదని అన్నారు.NSO గ్రూప్ తన స్పైవేర్ను అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, అయితే వారు దానిని తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు.
Must Read:-కేసీఆర్ పోరాటానికి విపక్షపాలిత రాష్ట్రాల మద్దతు! మాజీ ప్రధాని ఫోన్!!