ఏపీ సీఎం నిర్లక్ష్యం కారణంగా ఏపీలో పది లక్షల మంది కరోనా భారిన పడ్డారని నారా లోకేశ్ విమర్శించారు. కరోనా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, కరోనా రోగులకు కనీసం బెడ్లు కూడా కేటాయించలేకపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం లేదని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం పనికారాకుండా పోయిందన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం
కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా, ప్రమాదకరంగా మారిందని ఇలాంటి సమయంలో పది, ఇంటర్ పరీక్షలు పెట్టి వేలాది మంది విద్యార్థులను బలి చేయాలనుకుంటున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు మెసేజ్ లు పంపుతున్నారని ఆయన గుర్తుచేశారు. పరీక్షలు రద్దు చేయకుండే అవసరం అయితే న్యాయపోరాటం చేస్తామని లోకేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
must read: జగన్ బెయిల్ రద్దుపై రేపే విచారణ.. మరో బాంబు పేల్చిన రఘురామరాజు











