సీఎం జగన్రెడ్డి జాంబీరెడ్డిలా తయారయ్యాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ అక్రమ కేసులతో అరెస్టు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రాయవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో లోకేష్ పరామర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వారికి ఆనందం వస్తుందని ,కాని జగన్కు టీడీపీ నేతలు,కార్యకర్తల మీద కేసులు పెట్టడం,అరెస్ట్ చెయ్యడంలో ఆనందం వస్తుందని లోకేష్ అన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న జాంబీరెడ్డి రెండేళ్ల పాలనలో 25 మంది కార్యకర్తలను హత్య చేయించాడని అన్నారు. అనపర్తిలో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లుగా మారిందని, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అక్రమాలను, అవినీతిని టీడీపీ నేత రామకృష్ణారెడ్డి బయటపెట్టడంతో అక్రమ కేసులతో ఆయన్ను వేధించారన్నారు. ఎమ్మెల్యే అక్రమాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లోకేష్ విమర్శించారు.
Must Read ;- పులివెందుల పిల్లి పారిపోయింది : నారా లోకేశ్











