చాపకింద నీరులా కరోనా మహామ్మారి పంజా విసురుతోంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసులు తగ్గముఖం పట్టడం లేదు. తెలంగాణలో ఎక్కువగా గురుకుల విద్యాలయాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నారు. పిల్లల కోసం ఐసోలేషన్ గదులు ఏర్పాటుచేశారు. కేసులు పెరుగుతున్నందు వల్ల తెలంగాణలోని కొన్ని ప్రధాన ఆలయాలు సమయ వేళలు మార్చాయి.
కేసులు పెరుగుతున్నయ్
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 3.03 లక్షలకు కరోనా కేసులు చేరగా కరోనా వైరస్ తో 1,669 మంది మరణాణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,804 యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి 64, మేడ్చల్లో 34 కరోనా కేసులు నమోదయ్యయి. ప్రజల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.
Must Read : మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు