సీఎం జగన్ పులివెందులలో పర్యటిస్తున్నాడంటే .. ఓ రేంజ్ లో హడావిడి ఉండేది .. అయితే నేడు జగన్ .. ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా పులివెందులకు వెళ్లారు .. అయితే ఎక్కడా ..ఆ హడావిడి కనిపించలేదు . పార్టీ శ్రేణుల్లో సీఎం వస్తున్నారన్న జోష్ ఏ మాత్రం కనిపించలేదు .. దీనికి తోడు జగన్ పర్యటనకు మీడియా అనుమతి కూడా లేకపోవడంతో అందరు లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది ..సీఎం సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటన చేస్తున్నా .. సొంత పార్టీ నేతలు లైట్ తీసుకోవడం వైసీపీలోనే చర్చకు తావిస్తోంది .. ఇదే సమయంలో వైఎస్ షర్మిల , విజయమ్మలకి ఘన స్వాగతం లభించడం విశేషం .
. జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన వైఎస్సార్ జిల్లాలో సాగుతుంది . మొదట నేడు ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్ ఘాట్కు సీఎం జగన్ చేరుకుని జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు నివాళి అర్పించారు .. కార్యక్రమం పూర్తయ్యాక ఇడుపులపాయలో తన నివాసానికి చేరుకోనున్నారు. అయితే ఎక్కడ కూడా క్యాడర్ పెద్దగా కనిపించలేదు .
వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ 9వ తేదీ గండిపేట చేరుకుంటారు. గండిపేట వద్ద కొన్ని శంకుస్ధాపనలు చేయనున్నారు.. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమాల పట్ల కూడా శ్రేణులు ఉత్సాహం చూపుతున్నట్టు కనిపించలేదు . ఇక మున్సిపల్ ఆఫీసు ప్రారంభం అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్ –1 పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందులలోని నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తారు. పులివెందులలోని ఏపీ కార్ల్లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయో సైన్సెస్ను సీఎం జగన్ ప్రారంభించున్నారు. ఆదివారం మధ్యాహ్నంపులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. జగన్ అన్ని ప్రమభోత్సవాలకే పరిమితం కావడం .. వాటికి తర్వాత తాము సమాధానం చెప్పుకోవాల్సి రావడంతో స్థానిక నేతలు ఉత్సాహం చూపడం లేదు .
ఇక సోమవారం మూడోరోజూ సైతం జగన్ వైఎస్సార్ జిల్లాలోనే పర్యటించనున్నారు. జులై 10న ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అయితే వీటి దగ్గర ఎక్కడ కూడా హడావిడి కనిపించడం లేదు ..దీనితో గతంలో పర్యటనలు ఎలా ఉండేవి .. ఇప్పుడు ఎలా ఉండేవి అని సొంత నేతలే అవకవుతున్నారు
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











