ఈ హైటెక్ యుగంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర. అందుకే చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా చేసుకొని తమ సమస్యలపై స్పందిస్తుంటారు. సాధారణంగా సమస్యలు అనగానే వీధి చిరవన చెత్తా నిండిపోయిందని, రోడ్లు బాగాలేవనో లాంటి వాటిపై ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ యువకుడు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అందుకే ఆయనకు చాలామంది తమ సమస్యలు పరిష్కరించాలని రిక్వెస్ట్ చేస్తుంటారు. రఘుపతి అనే యువకుడు ‘లెగ్ పీస్, ఎక్స్ట్రా మసాలాతో చికెన్ బిర్యాని కావాలని ఆర్డర్ చేస్తే.. సరిగ్గా అందించలేదు. ప్రజా సేవ అంటే ఇదేనా ఇదేనా?’ అంటూ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ.. నాకు ఎందుకు ట్యాగ్ చేశావ్ బ్రదర్.. అంటూ రిప్లై ఇచ్చారు. అయితే లెగ్ పీస్ వ్యవహరంపై చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఇందుకు మజ్లీస్ నేత అసద్ కేటీఆర్ స్పందించాల్సిందేనంటూ.. ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.
Must Read ;- ఆయనొస్తే తమ ప్రాధాన్యం తగ్గుతుందనా.. తెలంగాణ బీజేపీలో ఈటల ప్రకంపనలు











