ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్టు కేంద్ర మంత్రి లోక్సభలో చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అమలు చేశారో చెప్పాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానాలు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి నిత్యానంద్ రాయ్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కేంద్ర పరిశీలనలో లేదని తేలిపోయింది.
వివిధ దశల్లో ఉన్నాయి..
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని గతంలో చెప్పిందే మరలా చెప్పారు. అందుకే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని ఆయన సభలో వెల్లడించారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం కొనసాగే ప్రక్రియ అని నిత్యానంద్ రాయ్ చెప్పారు. హామీల అమలు కోసం వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Must Read ;- ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన











