మాగోడు వినండి ..
రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వర్ణానాతీతంగా మారాయని ఉద్యోగులు వాపోయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శనివారం ఉదయం సచివాలయానికి తరలివచ్చారు. ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సమయంలో తమ సమస్యలను సహృదయంతో పరిష్కరించాలని ఉద్యోగులు కొంతమంది సజ్జల కాళ్లపై పడి గోడు విన్నవించుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకారం తమకు కూడా వేతనాలు పెంచాలంటూ వినతి పత్రం అందిజేశారు.
జీతాలు పెంచుతాం అన్న హామీని నెరవేర్చండి ..
జగన్ సీఎం అయితే తమ బ్రతుకులు బాగుపడుతాయని నమ్మి మా ఓట్లతోపాటు కుటుంబ సభ్యులతో చెప్పి మరి ఓట్లేపించినా.. నేటికి మాకు న్యాయం జరగలేదని ఓట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోయ్యారు. రెండేళ్లుగా అనేక సార్లు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి సమస్యలు విన్నవించినా ఫలితం లేదన్నారు. 11వ పీఆర్సీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి అవి మాటల రూపంలోనే మిగిలాయే తప్ప, అవి కార్యరూపం దాల్చలేదని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 15 వేల నుంచి రూ. 26 వేలకు పెంచాలని కోరారు.
Must Read:- ట్రెజరీ అధికారులపై చర్యలు.. చార్జీ మెమోలు జారీ! అన్నంత పని చేసిన జగన్ ప్రభుత్వం!!