రైళ్లలో తరచు అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. రైళ్లలో ఉండే మొబైల్ ఛార్జింగ్ పరికరాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చార్జింగ్ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల ముందే రైళ్లలో పొగ తాగడం కూడా నిషేధించింది. సిగరేట్ తో పట్టుబడితే అరెస్టు చేసి జైలుకు తరలిస్తామని కూడా హెచ్చరించింది.
Passengers Not Allowed to Charge Their Electronic Devices From 11 pm to 5 am in Railways
Must Read ;- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని చూశారా?











