అసెంబ్లీలో ప్రస్తుతానికి వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు ఏపీ ప్రజలు.. చిత్తు చిత్తుగా ఓడించి ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు.. ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావిడి చేస్తున్నారు.. దీనికోసం ఆయన ఏకంగా అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.. శాసనసభలో అడుగుపెడితే పరాభవం తప్పదనేది ఆయన భావనగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు..
ఈ విషయం పక్కన పెడితే, జగన్తోపాటు మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్ఎల్ఏ అభ్యర్ధుల మీద డిస్ క్వాలిఫికేషన్ కత్తి వేలాడుతోంది.. శాసనసభ స్పీకర్ అనుమతి లేకుండా వరసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకున్నా, మూడు శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టినా.. అనర్హత వేటు పడడం ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు హెచ్చరించారు.. దీంతో, జగన్ తెలివిగా గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.. దీనిని సాంకేతికంగా హాజరయినట్లు పరిగణించలేరని చెబుతున్నారు నిపుణులు..
ఒకవేళ, జగన్ ఆయన టీమ్ 10 మందిపై అనర్హత వేటు పడి, ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఎన్ని స్థానాలలో గెలిచే అవకాశం ఉందని పయోనీర్ సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది.. ఈ సర్వేలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది ఆ సంస్థ.. కూటమి సర్కార్ పనితనంతోపాటు, అధికారంలోకి వచ్చిన తరవాత తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సర్వే చేపట్టింది పయోనీర్ సంస్థ.. ఇటు, ఎమ్ఎల్ఏగా జగన్, ఆయన టీమ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరుని కూడా అంచనా వేసింది పయోనీర్.
మొత్తం 11 నియోజవకర్గాలలో వైసీపీ కేవలం నాలుగు స్థానాలలో మాత్రమే విజయం సాధించనుంది.. మిగిలిన 7 చోట్ల ఓటమి పాలవనుందని తేలింది. వైసీపీ గెలిచే నియోజకవర్గాలు ఏంటంటే…. పులివెందుల, బద్వేలు, పాడేరు, రంపచోడవరం.. ఇక మిగిలిన పుంగనూరు, రాజంపేట, మంత్రాలయం, ఆలేరు, ఎర్రగొండపాలెం, తంబళ్లపల్లి, దర్శి స్థానాలలో దారుణంగా వైఫల్యాన్ని చవిచూడనుంది వైసీపీ.. ఈ స్థానాలలో కూటమి అభ్యర్దులని ఎవరు నిలబెట్టినా వారు భారీ మెజారిటీలలో గెలుపొందనున్నాయి..
అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన మెజారిటీ భారీగా పడిపోనుంది. గత ఎన్నికలలో జగన్కి సుమారు 65 వేల మెజారిటీ దక్కింది.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే అది 30 నుండి 35 వేలకు పడిపోనుందని పయోనీర్ సంస్థ అంచనా వేసింది.. ఇక, షర్మిల పోటీ చేస్తే అది మరింత తగ్గనుందని చెబుతోంది..
జగన్కి ఈ సర్వే డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ఈ సంస్థ 2024 ఎన్నికలలో టీడీపీ కూటమికి 150-155 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.. వైసీపీ 20 నియోజకవర్గాలకే పరిమితం కానుందని వివరించింది.. దాదాపు ఈ అంకెలు నిజం అయ్యాయి.. అంతకుముందు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం ఖాయం అని పయోనీర్ సంస్థ విశ్లేషించింది.. మొత్తమ్మీద, వైసీపీకి ఈ సర్వే హెచ్చరికలు పంపుతోంది. మరి, జగన్ ఎలా అలెర్ట్ అవుతారో చూడాలి..











