కరోనా పంజా విసుర్తూ ఎందరో జీవితాలను ఛిన్నభిన్నం చేస్తోంది. కరోనా కోరల్లో చిక్కిన పేద రోగులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది. కరోనా సోకి రోగ విముక్తులైనవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా దానం చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
తెల్లరేషన్ కార్డులు ఉన్నవారు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉచితంగా ఫ్లాస్మా సరఫరా చేయాలని నిర్ణయించింది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు కోరుతోంది. దాదాపు 22 ఏళ్లుగా మెగాస్టార్ తన సొంత డబ్బుతో 9.27 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా రక్తదానం చేసినట్లు వివరించారు.