నెల్లూరు ముందస్తు అరెస్టులు!
రెండు రోజులుపాటు మూడు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ను వరద బాధితులు నిలదీస్తారని .. నిన్న కడప, చిత్తూరు జిల్లాలో ముందస్తు అరెస్టుల చేశారు. కొంతమందిని గృహనిర్భందం చేశారు. వరదల్లో సర్వకోల్పోయి, బ్రతుకు దుర్భరంగా మారాయి తమను ఆదుకోవాలని, గోడు విన్నవించుకోవాలని ప్రయత్నించిన బాధితులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు ఆంక్షాలు విధించారు. మూడు గంటలు పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ దామరపాలెం, జొన్నవాడ, పెనుబల్లి, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహాన్ని షురూ చేశారు. ఆయా ప్రాంతాల్లో వరద బాధితులు సీఎం నిలదీస్తారని అనుమానంతో ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం విశేషం. మరోవైపు ఏబీవీపీ విద్యార్ధి నాయకులను అరెస్ట్ ముందస్తుగా అరెస్ట్ చేసి, వాహనాల్లో ఎక్కించుకుని నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తిప్పారు. నెల్లూరు నుంచి మైపాడు, అక్కడి నుంచి ఇందుకూరుపేట పీఎస్ కు తరలించారు. పోలీసుల చర్యపై ఏబీవీపీ నేతలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారపార్టీ ఎమ్మెల్యేకు సైతం తప్పని అంక్షాలు!
నెల్లూరు సీఎం జగన్ పర్యటనలో ప్రశ్నించే ప్రజలకే కాదు .. అభినందించడానికి వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు కూడా పోలీసులు ఆంక్షాలు తప్పలేదు. నాయకుడు వస్తున్నాడు స్వాగతం పలుకుదామని వెళ్లిన సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పోలీసులు అడ్డుకున్నారు. కూడా వచ్చిన నాయకులను అక్కడే వదిలేసి, ఒక్కరే వెళ్లాలని హుకూం జారీచేశారు. దీంతో పోలీసులను ఎమ్మెల్యే ప్రాథేయపడి అడిగిన ఒప్పకోలేదు. చివరికి ఎస్పీ జోక్యంతో ఎమ్మెల్యే ఒక్కరే వెళ్లి కలిసొచ్చారు.
Must Read ;- అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్న ఏపీ ప్రభుత్వం!!