Government Employees Protest In Front Of CM Jagan In Tirupati
మా డబ్బులు .. పీఆర్సీ ఎప్పుడిస్తారు?
తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ రెడ్డికి ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు జలక్ ఇచ్చాయి. మేం దాచుకున్న డబ్బులు, పీఆర్సీ ఎప్పుడిస్తారని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎవరు ఊహించని విధంగా జగన్ టూర్ లో అలా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో జగన్ రెడ్డి మోహం చిన్నబుచ్చుకున్నాడు. పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే స్పందించిన జగన్ రెడ్డి పీఆర్సీ కావాలని బోర్డు చూపింది ఎవరు ..? ఎవరు? అని రెండుసార్లు అడిగాడు. దీంతో పీఆర్సీ ఫ్లకార్డు పట్టుకున్న ఉద్యోగి జగన్ ఎదుట నిలిచాడు. పీఆర్సీ కావాలని ఫ్లకార్డు చూపింది.. నీవేనా.. అని అడిగాడు. అవున సార్ .. మా సమస్యలు, గోడు కొంచెం వినండి .. పీఆర్సీనే కాదు అనేక సమస్యలున్నాయని విన్నవించాడు. అది విన్న జగన్.. ఒకే.. మీకు పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు ఆందోళన విరమించారు.
Government Employees Protest In Front Of CM Jagan In Tirupati
నివేదికవ్వకుండా పీఆర్సీ ప్రకటిస్తామంటే ఒప్పకోం…!
శనివారం ఏపీ అమరావతి సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాలతో కార్యదర్శులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వలేం అని అధికారులు తేల్చిచెప్పారు. సాంకేతిక పరమైన అంశాలపై అధ్యయనం జరుగుతోందని, అందుకే నివేదిక బయటపెట్టేది లేదని చెప్పారు. నివేదికివ్వకుండా చర్చలు ఎలా జరుగుతాయి? పీఆర్సీని ఎలా పదిరోజుల్లో ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు ప్రశ్నించారు. పీఆర్సీ అంటే ఫిట్మెంట్ ఒక్కటే కాదు .. డీఏ, హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు చాలా ఉంటాయి. ఇటువంటి అంశాలపై సమాచారం ఇవ్వకుండా ప్రకటిస్తామంటే అంగీకరించమని చెప్పారు. మొత్తం 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి ఇచ్చామని, నివేదికపై స్పష్టత ఇచ్చేవరకు తమ ఉద్యమం కొనసాగుతునే ఉంటుంది జేఏసీ నేతలు భీష్మించారు.
Must Read ;- మద్యం సీసాలో పురుగులు.. అత్యంత ప్రమాదకరం ఏపీ మద్యం..!











