ఆనందయ్యను పోలీసులు మళ్లీ రహస్య ప్రాంతానికి తరలించారు.శుక్రవారం ఆయన్నుఇంటి వద్ద దించిన పోలీసులు శనివారం తెల్లవారుజామున ప్రత్యేక బందోబస్తుతో రహస్య ప్రాంతానికి తరలించారు.మందు కోసం కృష్ణపట్నం వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు.ఆ గ్రామస్తులను మినహా బయటి వ్యక్తుల వాహనాలను అనుమతించడం లేదు.
ఇంటి వద్ద ఉద్రిక్తత
కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.ఆనందయ్య మందుల్లో శాస్త్రీయతను పరిశీలించేందుకు ఈ నెల 17 నుంచి ఉచిత మందుల పంపిణీని ప్రభుత్వం నిలిపి వేసింది.ఆనందయ్య మందుల శాంపిళ్లను ఆయుష్తో పాటు,ఐసీఎంఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది.మరికొద్ది రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో నిన్న ఆనందయ్యను పోలీసులు వదిలిపెట్టి మరల ఈ రోజు రహస్య ప్రాంతానికి తరలించారు.
ఆనందయ్య మందు పంపిణీ చేసిన ఎంపీ మాగుంట
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వద్ద ఆనందయ్య మందు వెలుగు చూసింది.ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఆనందయ్య మందు ప్యాకెట్లతో మాగుంట హల్ చల్ చేశారు.మంత్రులు విశ్వరూప్,సురేష్, బాలినేనికి ఎంపీ మాగుంట మందు సరఫరా చేయడం వివాదంగా మారింది.వారం రోజులుగా కొందరు వైసీపీ పెద్దలు ఆనందయ్యను అదుపులో పెట్టుకుని రహస్యంగా కరోనా మందు తయారు చేయించడం సంచలనంగా మారింది.ప్రభుత్వ అనుమతులు లేవని ఆనందయ్య మందు తయారీని నిలిపి వేసిన ప్రభుత్వం,వైసీపీ నేతలు రహస్యంగా పెద్ద ఎత్తున మందు తయారు చేయిస్తున్నా పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
Must Read ;- హైకోర్టును ఆశ్రయించిన ఆనందయ్య











