ఇవాళ సాయంత్రానికి ఐసీఎంఆర్ వైద్యుల బృందం కృష్ణపట్నం చేరుకునే అవకావం ఉందని వైద్య ఆరోగ్య మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆనందయ్య తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న మందుల్లో వాస్తవికతను ఐసీఎంఆర్ బృందం నిగ్గు తేల్చనుంది. అయితే ఇవాళ వేలాది మంది ఆనందయ్య ఆయుర్వేద మందుల కోసం ఎగబడటంతో పంపిణీ నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తరవాత మందు పంపిణీ ప్రారంభిస్తానని ఆనందయ్య మీడియాకు వెల్లడించారు.
ఇప్పటికే పరిశీలించిన డాక్టర్లు
ఈ నెల 17న ప్రభుత్వ డాక్టర్లు ఆనందయ్య తయారు చేస్తున్న మందుల విధానాలను పరిశీలించారు. దీనిపై లోకాయుక్తకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ నివేదికను కూడా అందించారు. ఆనందయ్యకు ఆయుర్వేదంలో ఎలాంటి క్వాలిఫికేషన్ లేదని, కొన్ని హెర్బ్స్ కలిపి తయారు చేస్తున్న మందులు కూడా ప్రమాణాలు లేవని అందులో వివరించారు. రోగుల కంట్లో ఆనందయ్య వేస్తున్న ఆయుర్వేద చుక్కల మందు వల్ల చూపు కూడో కోల్పోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు. దీనిపై తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్ బృందం నిజాలను నిగ్గుతేల్చనుంది.
Must Read ;- తొలగిన అడ్డంకులు.. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ











