విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎరులై పారుతున్న జె బ్రాండ్ మద్యం, కల్తీ సారాలకు వ్యతిరేకంగా విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు టిడిపి పిలుపునిచ్చింది.ఈ క్రమంలో టిడిపి నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఆందోళనకు బయలుదేరిన పలువురు టిడిపి నేతలను అనుమతి లేదంటూ పోలేసులు హౌస్ అరెస్ట్ చేశారు.పోలీసుల తీరుపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు , నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన నడుస్తోందని, జగన్ పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వారిలో దేవినేని ఉమ, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, అచ్చెన్నాయుడు, బొడే ప్రసాద్, వర్ల రామయ్య సహా పలువూ నేతలు ఉన్నారు.
Must Read:-వైసీపీ అరాచకాలకు అమాయకురాలు బలైంది | Analyst Srinivasa Rao on Machilipatnam VAO Nagalaksmi Incident