వామన్ రావు దంపతుల హత్యకేసు రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మంథని న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు అందించారు. అందులో హత్య జరిగిన విధానం.. ఆ తర్వాత నిందుతులు ఏం చశారనే విషయాలు స్పష్టమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. వామనరావు దంపతులను అడ్డగించి మరీ దారుణంగా కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా చంపారు. దీనిపై చనిపోతూ వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మోలం కీలకంగా మారింది. ఈ హత్యలను సుమోటాగా తీసుకున్న హైకోర్టు విచారణకు ఆదేశించడంతో కేసు మరో మలుపు తీసుకుంది. కోర్టు సీరియస్ అవడంతో నిందితులను త్వరతగతిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వారికి సంబంధించిన రిమార్డు రిపోర్టు కూడా కోర్టుకు సమర్పించారు.
పోలీసుల రిమార్డు రిపోర్డు ప్రకారం.. కల్వచర్ల సమీపంలో వామన్ రావు , నామమణిల దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులు.. ఘటనా స్ధలి నుంచి నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నరని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు.. తమ దుస్తులను కూడా బ్యారేజీలో పడేసి.. కారులో వాంకిడి చెక్ పోస్ట్ వద్దరకు చేరుకుని.. ఈ రాత్రికి కారులో నిందితులు నిద్రించినట్లు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు. వారి పనులకు అడ్డువస్తున్నందునే వామన్ రావు దంపతులను హత్య చేసి అడ్డు తొలగించేకోవాలని చూసినట్లు రిపోర్టులో స్పష్టంగా తెలిపారు పోలీసులు.
Must Read ;- కలకలం రేపిన లాయర్ దంపతుల హత్య.. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు











