అనంతలో హీట్ పెంచుతున్న రాజకీయాలు!
అనంతపురం జిల్లాలో రాజకీయాలు మంచి కాకమీద ఉన్నాయి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధికారపార్టీ వైసీపీ ఎమ్మెల్యేపై యుద్ధం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో అనంత అర్భన్ లో ఏం అభివృద్ధి చేశారో చూపాలని ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేస్తూ.. మూడు రోజులుపాటు నియోజకవర్గంలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి వెంకట్రామిరెడ్డి చేసిందేమి లేదంటూ.. దీనిపై చర్చకు ఎక్కడికైనా వస్తానంటూ సవాల్ విసిరారు ప్రభాకర్ చౌదరి. దీంతో ఇరువురి నేతల మధ్య మాట యుద్ధం కోటలు దాటుతోంది. టీడీపీ హయంలో చేసిన అభివృద్ధి తప్పితే ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఏమీ చేయలేదని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనంతపురం పట్టణంలో మూడు రోజులపాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో తాము ఆమోదం తెలిపిన కార్యక్రమాలు నేడు కొనసాగిస్తూ షో చేస్తున్నారని విమర్శించారు. అందుకే టీడీపీ శ్రేణులు నేతృత్వంలో తాను పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పట్టణ ప్రజలకు వైసీపీ నేతల డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేస్తానని ప్రభాకర్ చౌదరి భీష్మించుకున్నారు.
తగ్గేదేలే అంటున్న అనంత టీడీపీ నేతలు!
అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మచ్చుకైనా లేదని అన్నది టీడీపీ నేతుల ఆరోపిస్తున్నారు. తాడిపత్రి అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు ఒకరిపై ఒకరు ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. తాడిపత్రిలో కేవలం విగ్రహా రాజకీయాలు తప్ప వైసీపీ వల్ల ప్రజలకు వరిగిందేమి లేదు అన్నదే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇరువురు మధ్య నెలకొన్న వార్ నిజయోకవర్గం రాజకీయాలను హీటును పెంచుతున్నాయి. అలానే ఇటీవల జిల్లాల పునర్విభజన నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన నిరసన వ్యక్తం చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తూ.. మౌనవత్రం చేపట్టారు. తాజాగా అనంతపురం అర్భన్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధికార వైసీపీ నేతలపై యుద్ధ ప్రకటించారు. వైసీపీ నిర్లక్ష్య పాలనకు చరమగీతం పాడెందుకు ప్రభాకర్ చౌదరి పట్టణంలో జెఎన్టీయూ నుంచి రేపు ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మూడు రోజులు పాటు సాగే పాదయాత్రకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ పాదయాత్రతో అనంత రాజకీయ వాతవరణం ఒక్కసారి వేడెక్కినట్లుగా కనిపిస్తోంది. ఇలా ఓవర్ ఆల్ గా అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ నేతల నిర్లక్ష్యంపై తెలుగుదేశం నేతలు తిరగబడుతున్నారు. ప్రజల మద్దతును కూడగట్టుకుని ప్రాంతాల అభివృద్ధి కోసం పోరాటాలకు కార్యచరణను రూపందిస్తున్నారు.
Must Read:-వైసీపీని రోడ్డుమీద తిరగనివ్వమంటూ నినాదాలు! మంత్రి వెల్లంపల్లిని తాకిన ప్రజావ్యతిరేక సెగ!!