సీబీఐకి సౌభాగ్యమ్మ వాంగ్మూలం
వివేకా హత్యానంతరం గత ఏడాది జూన్ 13, 24, ఆగస్టు 27 తేదీలలో సీబీఐ అధికారుల ఎదుట వివేకా భార్య సౌభాగ్యమ్మ వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త కళ్లద్దాలు లేకుండా అసలు రాయలేరని.. వివేకా హత్యకు గురైన రోజు ఆయన బెడ్ రూంలో తీసిన వీడియో ఫుటేజ్ లో కనిపించిన కళ్లద్దాల కవర్లు రెండింటిలో ఒకటి పులివెందులలోని జ్యోతి ఆప్టికల్స్ వద్ద కొన్నట్లు ఆమె తెలిపారు. తమ కంపెనీలన్ని వివేకానందరెడ్డి పేరుతోనే ఉన్నాయని, ఆ బోర్డుల్లో ఆయనే డైరెక్టర్ గా కొనసాగారని సౌభాగ్యమ్మ సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఏయే కంపెనీల్లో ఆయన వాటదారుడిగా ఉన్నారో ఆ వివరాలన్నీ పొందుపరుస్తూ సమర్పించారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఎదుట నిందుతులు, అనుమానితులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది మూడు సార్లు వివేకా సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం నేడు వెలుగులోకి వచ్చింది. అంతేకాక సీబీఐ ఎదుట ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు.
దస్తగిరి మాకు అప్పున్నాడు..
వివేకా వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి తమ వద్ద అప్పుగా డబ్బులు తీసుకునేవాడని సీబీఐకు వైఎస్ సౌభాగ్యమ్మ వివరించారు. తన సోదరి వివాహం అని చెప్పి తన వద్ద రూ. 95 వేలు తీసుకున్నాడని, నోట్ రాయించి ఇచ్చాడని, సాక్షిగా షేక్ ఇనయతుల్లా సంతకం కూడా చేశాడని ఆమె పేర్కొన్నారు. మరోవైపు వివేకా హత్యకేసును సీబీఐ దర్యాప్తు చేయాలని, ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని గతంలో సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే!
Must Read:-అయ్యో .. పాపం ఏపీ పోలీసులు! వారి గతి పగవారికి కూడా పట్టకూడదు !!