గుంటూరు నగరపాలక సంస్థ పరిథిలో వైసీపీ సీనియర్ నాయకులు, 6వ వార్డు కార్పోరేట్ అభ్యర్థి గాంథీ మృతితో ఏర్పడిన ఖాళీకి అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి ఘనం విజయం సాధించి, విజయకేతనం ఎగవేసింది. అధికారంలో ఉన్నాం… చనిపోయిన అభ్యర్థి కూడా వైసీపీకి చెందిన వారే కదా .. అని సింపతి గేన్ చేయాలని చూసిన అధికార పార్టీకి ఇక్కడ భంగపాటు తప్పలేదు. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో ఏపీ నడిబొడ్డు, అది రాజధాని గుంటూరు నగరం నుంచే స్పష్టమైంది. ఈ వార్డులో టీడీపీ అభ్యర్ధి పోతురాజు సమత 537 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గుంటూరు నగర పాలక సంస్థ పరిథిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క జిల్లా పరిథిలోని దాచేపల్లి నగర పంచాయితీకి నిర్వహించిన ఎన్నికల్లో 20 వార్డులకు గానూ ప్రస్తుతానికి 2, 4, 5, 6, 7, 15,16 వార్డుల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 7 వార్డుల్లో తెలుగు దేశం విజయం సాధించగా .. జనసేన 1, అధికార వైసీపీ – 2 వార్డులను కౌవసం చేసుకున్నాయి. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
Must Read ;- దర్శి నగర పంచాయితీలో ’టీడీపీ‘ ఘన విజయం!