వద్దు.. మా ఊరికి మీరు రావద్దు అంటూ వైసీపీ నేతలపై ప్రజాగ్రహం!
ఏపీ వ్యాప్తంగా వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి! శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగపడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎదురౌతున్న నిరసనల సెగలు కారణంగా నియోజకవర్గాల్లో పర్యటించాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధే తప్ప.. జగన్ ప్రభుత్వంలో వీసమెత్తు అభివృద్ధిని కూడా ప్రజలు చూడలేదు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ధైర్యంగా ప్రజారణ్యంలోకి వెళ్లి.. ప్రజలతో మమేకమవ్వలంటే జంకుతున్నారు.
మంత్రి వెల్లంపల్లికి తాకిన నిరసన సెగ!
ఏపీ దేవాదాయ శాఖా మంత్రికి జిల్లా పునర్విభజన సెగ తగిలింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం వెళ్తూ ప్రకాశం జిల్లా మర్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్ధానంలో మంత్రి వెల్లంపల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ నేతలు మంత్రి వెల్లంపల్లిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన నినాదాలను అందుకున్నారు. చివరికి గత్యంతరం లేక మంత్రి శ్రీనివాస్ కారు దిగి వారి సమస్యలను విన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను మంత్రికి జేఏసీ నేతలు విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామి ఇచ్చారు. అంతేకాక మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు జరుగుతన్నాయి!
Must Read:-నిర్వేదంతో వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్షా!? జిల్లాల పునర్విభజనపై భగ్గుమంటున్న రాష్ట్రం!!