ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించి 20 రోజులు అవుతోంది. రేపటి నుంచి ఎనిమిదో తరగతి క్లాసులు కూడా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ప్రకటించారు. అంతా బాగానే ఉంది. కానీ అసలు ప్రభుత్వ పాఠశాలలకు ఎంత మంది విద్యార్ధులు హాజరవుతున్నారో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. పాఠశాలలు ప్రారంభించి 20 రోజులు దాటినా 20 శాతం మించి విద్యార్ధులు క్లాసులకు హాజరుకావడం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కరోనా సోకడమే ఇందుకు కారణంగా తేలింది.
Also Read:-మరో అడుగు వెనక్కు తగ్గిన జగన్!
ఈ మాత్రం దానికి ఎందుకు
పాఠశాలలు ప్రారంభించి విద్యా సంవత్సరం వృథా కాకుండా కాపాడామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం విద్యార్థులను మాత్రం పాఠశాలలకు రప్పించలేకపోతోంది. ప్రభుత్వ పాఠశాలలకు 80 శాతం మంది విద్యార్ధులు హాజరు కావడం లేదు. దీంతో ఏపీ విద్యాశాఖ ఓ సర్వే నిర్వహించింది. పిల్లలను పాఠశాలలకు ఎందుకు పంపడం లేదని 71 వేల మంది తల్లిదండ్రులను పశ్నించారు.
Must Read:-సంపాదకీయం : ఏపీ సర్కార్ ఇప్పటికైనా ఒప్పుకుంటుందా?
ఇప్పటికే పాఠశాలలో కొంతమంది విద్యార్ధులకు కరోనా వచ్చిందని, మా పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉందని, అందుకే పాఠశాలలకు పంపడం లేదనే సమాధానం వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించలేక, అటు పాఠశాలలు తెరిచినా విద్యార్ధులు రాక రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.పాఠశాలలు ప్రారంభించినా వసతి గృహాలు ప్రారంభం కాకపోవడం, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు రావడానికి రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని తేలింది.
Must Read:-బడిగంట మోగితే.. జనంలో చావు భయం!
ఆన్ లైన్ క్లాసులే మేలు
పాఠశాలలు ప్రారంభిస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని ది లియో న్యూస్ ముందే హెచ్చరించింది. తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు. కరోనా టీకా వచ్చే వరకు ఆగి, ఆ తరవాత తరగతులు ప్రారంభిస్తే విద్యార్దులు పాఠశాలలకు వచ్చేవారు. కానీ ప్రభుత్వం ఎవ్వరూ చేయలేని పని మేము చేసేశామని చెప్పుకోవడానికే ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. విద్యార్ధులపై అంత ప్రేమ ఉంటే అందరికీ ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి, ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తే చాలా బాగుండేది. విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా ఆనందించేవారు. కానీ అలా చేయకుండా హడావుడిగా పాఠశాలలు ప్రారంభించి అటు ఉపాధ్యాయుల్లో, విద్యార్ధుల్లో కరోనా వ్యాప్తికి కారణమైందనే విమర్శలు వస్తున్నాయి.
Also Read:-ఏపీలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు తప్పని సరి కానుందా?