ఎంపీ రఘురామరాజు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతోనే రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే సొంతపార్టీపై రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం నారాయణ తప్పుపట్టారు. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజమని, ఎంపీపై కుట్రపూరిత చర్యలు తీసుకోవడం ఎంతమాత్రం సమర్దనీయం కాదన్నారు. చట్టప్రకారం కోర్టు ఆదేశాలను ఎందుక అమలు చేయలేడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా లేకుండా చేయడం అసాధ్యమని, ఒకవేళ అదే పరిస్థితి వస్తే.. ప్రజల ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని నారాయణ హెచ్చరించారు.
Must Read ;- జ్యుడిషియల్ అధికారి ఆధ్వర్యంలో రఘురామకు వైద్య పరీక్షలు