మహారాష్ట్రలోని పుణెలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పుణెలోని పౌద్ అనే ప్రాంతానికి దగ్గర్లో ఈ ఘటన జరగ్గా.. ఆ హెలికాప్టర్ ముంబయి నుంచి విజయవాడకు వస్తోంది. మధ్యలోనే ఇలా ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే, వీరిలో అందరూ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, అందరికీ గాయాలు అయ్యాయి. వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబును చంపే ఓ భారీ కుట్ర కోణం దాగి ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఆ ప్రమాదం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బయటకు చెబుతున్నారు. కానీ, హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనల కోసమే హెలికాప్టర్ను ముంబయి నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్ దశలో ఉన్న హెలికాప్టర్ను విజయవాడకు పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు సులువుగా వెళ్లడం కోసం ముఖ్యమంత్రులు హెలికాప్టర్లలో వెళ్లే సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఏవియేషన్ కంపెనీల నుంచి అద్దెకు లేదా లీజుకు తీసుకుంటాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు పర్యటనల కోసం ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఆధ్వర్యంలో గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజులలో కూడా సీఎం పర్యటనలు వివిధ జిల్లాల్లో ఉన్నాయి. ఈ కారణంగానే సీఎం పర్యటన కోసం ఆ హెలికాప్టర్ ను హైర్ చేసుకున్నట్లు తెలిసింది.
అదే హెలికాప్టర్ తాజాగా క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ లో ఈ రేంజ్ లో లోపాలు రావడం అనేది జరగకూడదు. మంచి కండీషన్ లో ఉన్న హెలికాప్టర్లనే వీవీఐపీల కోసం వాడుతుంటారు. తరచూ సాంకేతికలోపాలు తలెత్తుతూ ఉండే పాతబడిన హెలికాప్టర్లను సీఎంల కోసం వాడరు. కానీ, ఇక్కడ చంద్రబాబు కోసం మెయింటెనెన్స్ లో ఉన్న హెలికాప్టర్ ను పంపడం అనుమానాలను రేకెత్తిస్తోంది.
మరోవైపు, వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయింది అనుకోవడానికి లేదు. పైలట్లు తమ మార్గంలో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే రిపోర్టు చూసి బయలుదేరుతుంటారు. ప్రతికూలంగా వాతావరణం ఉందనుకుంటే.. అసలు బయలుదేరే ప్రయత్నమే చేయరు. ఒకవేళ మార్గమధ్యలో అకస్మాత్తుగా ప్రతికూల వాతావరణం ఎదురైతే.. సేఫ్ ప్లేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వంటివి చేస్తుంటారు. కానీ, ఈ ఘటనలో హెలికాప్టర్ కుప్పకూలిపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. అందుకే ఈ అంశంలో ఇప్పుడు కేంద్ర ఏవియేషన్ అధికారులు, ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.
సైకో కుట్ర??
అయితే, ఈ హెలికాప్టర్ ఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా టీం స్పందించిన తీరు గమనిస్తే.. మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే, సైకో పార్టీ సోషల్ మీడియాలో వికృత రాతల రాశారు. దాన్ని బట్టి, చూస్తే.. చంద్రబాబుకు ముప్పు తలపెట్టేందుకు సైకో జగన్ పథక ప్రణాళిక వేశారా అనే అనుమానం కూడా కలుగుతోంది. అసలే జగన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన తాను ఎలా ఓడిపోతాను అంటూ పదే పదే ఏడుపు స్వరం వినిపిస్తున్నారు. పైగా జగన్ రెడ్డి.. తన మెడకు కేసుల ఉచ్చు ఎక్కడ తగులుతుందో అని తెగ వణికిపోతున్నారు. మొండి వైఖరితో గత సెప్టెంబరులో సచ్ఛీలుడైన చంద్రబాబును జైలులో పెట్టి పగ తీర్చుకున్నారు జగన్. అలాంటి పని చేశాక కూడా తనను కూటమి ప్రభుత్వం ఊరికే వదిలేస్తుందని జగన్ అనుకోవడం లేదు. మరోసారి కారాగార వాసం తనకు తప్పదని, అందులోనూ ముప్పేట కేసులతో ఈసారి బయటికి వచ్చేందుకు కూడా వీలుకాని రీతిలో తనకు ట్రీట్మెంట్ ఉండబోతుందనే నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి దిక్కులేని పరిస్థితుల్లోనే జగన్ తన పాడుబుద్ధి చూపించుకుని ఉంటాడని అంటున్నారు. తనకు అడ్డొచ్చిన వారిని లేదా తన అధికారం కోసం అయిన వారినే అంతం చేయించిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డి పేరుపైన ఉంది. కన్న తండ్రి చనిపోయినా కూడా ఆ శ*వాన్ని పక్కన పెట్టుకొని అధికారం కోసం వెంపర్లాడిన పాడు చరిత్ర ఆయనది. పైగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, నియంతలా వ్యవహరిస్తూ ఒక సైకోగా జగన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆ సైకో తనమే తాజాగా చంద్రబాబుపై కుట్రకు ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ తరచూ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి వస్తున్నారు. అక్కడ రహస్యంగా ఎవరెవర్ని కలుస్తున్నారో, అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ తెలీదు. బహుశా బెంగళూరు ప్యాలెస్ వేదికగానే.. ఈ హెలికాప్టర్ కుట్రకు ప్లాన్ వేసి ఉంటారా అనే చర్చ జరుగుతోంది. లోపాలున్న హెలికాప్టర్ ను చంద్రబాబు పర్యటన అవసరాలకు పంపడంలో జగన్ పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. జగన్ అండ్ కో సదరు హెలికాప్టర్ సంస్థ లోపాలున్న హెలికాప్టర్ ను పంపేలా చేసినట్లుగా భావిస్తున్నారు.
అయితే, ఆ హెలికాప్టర్ చంద్రబాబు వద్దకు చేరకముందే కూలిపోయింది. ఇలా తమ ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో, నిరుత్సహంలో సైకో ముఠా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్న ఈ ప్రాథమిక అనుమానాలు మరికొద్ది రోజుల్లోనే తేలనున్నాయి. ఇప్పటికే సీఎం కోసం వస్తున్న హెలికాప్టర్ కూలిపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు.. రాష్ట్ర పోలీసులు, కేంద్ర ఏవియేషన్ వర్గాలు, ఇంటెలిజెన్స్ విభాగం. ఈ స్కెచ్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, వారి వెనుక బడా నేతలు కూడా బయటికి వస్తారని అంటున్నారు.