వైసీపీ మత కల్లోల రాజకీయాలు!
వైసీపీ పాలనలో మత ఘర్షణలు సరికొత్తగా పురుడుపోసుకుంటున్నాయి. ఏపీలో జగన్ రెడ్డి పాలనలో అక్రమాలు అడ్డుఆపుల లేకుండా సాగుతున్నాయి. ముస్లీం పండమెంటల్ కార్యకలపాలు ఏపీ రాజ్యమేలుతున్నాయి. నిత్యం అల్లర్లును ప్రోత్సహిస్తూ.. సీఎం స్థాయిలో జగన్ రెడ్డి చేయాల్సిన బాధ్యతలను విస్మరిస్తున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి మంత్రి మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో మసీదు కట్టడంపై చెలరేగిన అల్లర్లును సమర్థవంతంగా ఆదుపులోకి తీసుకురావాల్సిన జగన్ ప్రభుత్వం.. అటువంటి వాటిని ప్రోత్సహిస్తూ.. పోలీసులను వారి డ్యూటీలను వారిని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. ఆత్మకూరు బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారని ఆయన ఆరోపించారు.
ఆత్మకూరు అల్లర్లు వెనుక ఎస్డీఎఫ్!
అనంతపురం జిల్లా, ఆత్మకూరు మజీద్ ఘటన వెనుక ఎస్డీఎఫ్ అతివాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు పోలీసు శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో వెలుగోడుకు చెందిన ఆరుగురు ఎస్డీఎఫ్ అతివాద సంస్థ సభ్యులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరు ఎస్డీఎఫ్ అతివాద సంస్థ నిర్వహించిన శిక్షణా తరగతులకు వెళ్ళి వచ్చినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆత్మకూరు పోలీసు స్టేషన్ పై జరిగిన దాడితో మొత్త 15 మంది గాయపడగా.. ఇందులో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో ఓ కానిస్టేబుల్ కు దవడ చిట్లిపోయిగా.. మరో ఇద్దరికీ గాయాలై.. సర్జరీ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 60 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విధితమే!
Must Read:-వైసీపీకి ఓటు వేయకుంటే.. మీ పింఛన్లు వేరే జిల్లాకు మారిపోతాయంతే..!